బిహార్ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశలుగా పోలింగ్ నిర్వహించగా.. నేడు ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్డీఏలోని అనుభవజ్ఞుల నుంచి మహాకూటమి నేతృత్వంలోని యువశక్తికి ‘అధికార పీఠం’ చేతులు మారుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో.. దేశ ప్రజలు బిహార్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 55 కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. సీఆర్పీఎఫ్కు చెందిన 19 కంపెనీలను రంగంలోకి దించింది. స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు హాళ్ల వద్ద ఈ భద్రతా సిబ్బందిని మోహరించనుంది.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 59 కంపెనీలను దింపింది. ప్రతి కంపెనీలో 100 మంది సిబ్బంది ఉండనున్నారు. దీనితో పాటు స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు తమ సహకారాన్ని అందించనున్నారు.
నేను కాంగ్రెస్ ని వీడబోను.. తేల్చి చెప్పిన విజయశాంతి!
దేశంలోనే జగనన్న బెస్ట్ సీఎం..!