- Advertisement -
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య పార్థివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. రోశయ్య పార్థవ దేహాంపై పూల మాల వేసిన సీఎం.. రోశయ్య కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
మరోవైపు రోశయ్య పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్ జస్టీస్ ఎన్వీ రమణ నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి రోశయ్య అన్నారు. రోశయ్య హఠాత్మరణం చాలా బాధాకరమన్నారు. రోశయ్య అర్థ శతాబ్దానికిపైగా ప్రజలకు సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. రోశయ్యతో తనకు దగ్గరి అనుభందం ఉందని ఎన్వీ రమణ తెలిపారు.