అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జార్జియాలో చేపట్టిన ఆడిట్ (చేతితో ఓట్ల లెక్కింపు) ప్రక్రియ నేటి రాత్రి నాటికి ముగుస్తుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇది ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు రాష్ట్ర అధికారులను అనుమతిస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆడిట్ అవసరమైన 5 మిలియన్ల ఓట్లను చేతితో లెక్కిస్తున్నారు. అయితే ఇది ఎన్నికలపై అనుమానాలు, రీకౌంటింగ్పై అధికారిక అభ్యర్థనతో మాత్రం కాదని స్పష్టం చేశారు అధికారులు.
రాష్ట్ర ఎన్నికలపై కొత్త చట్టాన్ని గత ఏడాది అమలులోకి తెచ్చారు. అయితే.. చట్టంలో భాగంగా ఆడిట్ నిర్వహించాలా వద్దా అన్న దానిపై రాష్ట్ర మంత్రిదే తుది నిర్ణయం. అధ్యక్ష ఎన్నికలు ముఖ్యమైనవి, చాలా తక్కువ మార్జిన్ ఉండటం వల్ల రీకౌంటింగ్ అవసరంగా భావించినట్లు తెలిపారు రాష్ట్ర మంత్రి బ్రాడ్ రాఫెన్స్పెర్గర్.
పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!