తెంలంగాణలో ఆర్టీసీ చార్టీలు పెంచేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమైంది. పల్లె వెలుగు బస్సులకు కిలో మీటర్కు 25 పైసులు, ఎక్స్ ప్రెస్, డీలక్స్లకు 30 పైసల చొప్పున పెంచేందుకు ఆర్టీసి ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది.
కోవిడ్ సమయంలో జీవనం సాగించడమే కష్టమైన తరుణంలో ఆర్టీసీ పిడుగు వేసేందుకు సిద్దమైంది. ఇప్పుడున్న చార్జీలు భరించలేకే హైదరాబాద్ నగరంలో చాలా వరకు బస్సు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడటంలేదు.. మరి ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతే.. అధి ఆర్టీసీకి నష్టమా… లాభమా అనే సందేహాలు మొదలయ్యాయి.
మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం విలువైన ఆర్టీసీ ఆస్తులను అనుచరులకు కట్టబెట్టి.. ఆర్టీసీ డిపోల సంఖ్య తగ్గించిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యామ్నాయ రాబడులను మూసేసి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉందనే పేరుతో గరీబొడి జేబుకు చిల్లుపెడుతున్నారని విమర్శించారు.