Monday, April 29, 2024
- Advertisement -

పోటా పోటీ ధర్నాలు… రైతుల ఎదురు చూపులు

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గతంలో తెలంగాణలో సాగునీరు, విద్యుత్ కోసం ఎదురు చూసే అన్నధాతలకు ఇప్పుడు వరి కొనుగోలులో ఇబ్బందులు మొదలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఆరుకాలం కష్టించి పండిచిన వరిధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తరలించగా మర్కెట్‎లో వరి కొనే నాదుడే కరువయ్యారు.

దీంతో రైతులు వడ్ల రాశుల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పంటపండిచడానికి ఎంతో కష్టపడ్డ అన్నదాతలు.. ఆ పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‎కు తీసుకు వచ్చిన పంట అమ్మలేక తిరిగి తీసుకెళ్లలేక అయేమయం స్థితిలో రైతులున్నారు.

మరో వైపు ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తానని చెప్పడంతో రైతులు ధాన్యాన్ని ఐకేపీ ప్రాంతాలకు తరలిస్తునారు. పలు చోట్లు వరి కోనుగోలు పనులు ప్రారంభం కాగా.. తేమ ఎక్కువగా ఉండటంతో రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. అదే సమయంలో వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాల వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతోంది. ఐకేపీ సెంటర్‎లో వరి ధాన్యం తడిసి ముద్ద అవుతోంది. అధికారులు త్వరగా తమ ధాన్యాన్ని కొనుగోలు చెయాలని రైతులు కోరుతున్నారు.

ఒకపక్క రైతులు వానాకాలంలో పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంటే… మరోవైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వలు పోటా పోటీ ధర్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందా… కుప్పం వైసీపీ వశం..

గువ్వల ఎక్కడ..? రాజీనామా ఎప్పుడు..?

ట్రోలింగ్ భారీన పడ్డ పుష్ప

కోటి కావాలంటున్న మెహరీన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -