అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. న్యాయస్థానంటూ దేవస్థానం అనే నినాదాలతో యాత్ర కొనసాగించిన అమరావతి ప్రజలు తిరుమల శ్రీవానిరి దర్శించుకొని తమ పాదయాత్రను ముగించుకున్నారు. ఐతే గతంలో తాము డిసెంబర్ 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని రైతులు ప్రభుత్వానికి కోరగా దీనికి ప్రభుత్వం ఒప్పుకోలేదు
రైతుల యాత్రను పదే పదే అడ్డుకున్న ప్రభుత్వం.. రైతుల మనో ధైర్యాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. దీంతో రైతులు యాత్రను ఘనంగా ముగించారు. మరోవైపు తిరుపతిలో సభ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని కోరగా.. దీనికి మాత్రం ప్రభుత్వం ఒప్పుకోలేదు. వర్షాలు పడే ఛాన్స్ ఉనాయని సభ వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బంది కల్గుతోందని పోలీసులు రైతులను అడ్డుకున్నారు.
దీంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా రైతుల పిటిషన్కను పెండింగ్లో ఉంచిన కోర్టు ఎట్టకేలకు రైతుల సభకు అనుమతిచ్చింది డిసెంబర్ 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సభకు అనుమతిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
తెలంగాణలోకి ప్రవేశించిన ఒమైక్రాన్