Monday, April 29, 2024
- Advertisement -

సుప్రీం కోర్టులో ట్రంప్ కొత్త అభ్యర్ధన..!

- Advertisement -

జో బైడెన్​ను అధికారికంగా అమెరికా అధ్యక్షుడిగా ఎలక్టోరల్​ కాలేజీ ఎన్నుకున్నప్పటికీ.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం పట్టువీడటం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికీ వాదిస్తూనే ఉన్న ట్రంప్​ యంత్రాంగం.. తాజాగా అగ్రరాజ్య సుప్రీంకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేసింది. పెన్సిల్వేనియాలోని మెయిల్​-ఇన్​ బ్యాలెట్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్చాలని ఈ తాజా వ్యాజ్యంలో కోరింది. ప్రజల నిర్ణయాన్ని తిరస్కరించి.. ఎలక్టోరళ్ల ఎంపిక బాధ్యతను ఆ రాష్ట్ర అసెంబ్లీకి అప్పగించాలని పేర్కొంది.

అయితే ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పులు ఇవ్వడం దాదాపు అసాధ్యం. అదే సమయంలో ఒక వేళ పెన్సిల్వేనియా ట్రంప్​కు దక్కినా.. అధ్యక్ష పీఠాన్ని పొందేందుకు సరిపడా గణాంకాలు బైడెన్​ వద్ద ఇంకా ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -