బీజేపీ ఎంపీలపై ప్రధాని మోడీకి కోపం వచ్చిందా ? ఎన్నడూ లేని విధంగా పార్టీ నేతలు మారాలని ఎందుకన్నారు ? మంత్రులు వారి తీరు మార్చుకోవాలన్నారా ? లేక బీజేపీ ఎంపీలను వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ? లేక రానున్న రోజుల్లో తెలంగాణలో పట్టు సాధించడానికి తెలంగాణ ఏంపీలకు వార్నింగ్ ఇచ్చారా ? ఇది ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది.
ప్రధాని మోడికి బీజేపీ ఎంపీలపై కోపం వచ్చిది. పార్లమెంట్లో తమ ఎంపీలు, మంత్రులు సభను సజావుగా జరగనివ్వడంలేదని మోడీ అసహనంతో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించినట్లు, వారి వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మోడీ తెలుసుకున్నట్లు సమాచారం ? దీంతో ఎంపీలకు ప్రధాని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో పాటు తెలంగాణలో పార్టీ భలోపేతం కావాలంటే అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలి. అభివృద్ది కార్యక్రమాలు జరుగుతనే తెలంగాణ ప్రజలు మనవైపు ఉంటారని వారిని మనం మచ్చిక చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. దానిని దృష్టిలో ఉంచుకోని తెలంగాణ ఎంపీలు పనిచేయాలని మోడీ సూచించారనే టాక్ వినిపిస్తోంది.