ప్రపంచంలో మనుషుల్ని పట్టిపీడిస్తున్న రోగాలల్లో ఉబకాయం ఒకటి.ప్రపంచీకరన నేపథ్యంలో శారీరక శ్రమ తక్కువ కావడంతో ఉబకాయం పెరుగుతోంది.ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది పెద్దలు, పిల్లలు ఎక్కువ బరువు లేదా స్థూలకాయంతో బాధ పడుతున్నారు.
ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనాభా ఉబకాయంతో భాదపడుతున్నారు.ఇది ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగిపోతోంది.అమెరికా ప్రజలే అన్ని దేశాల కన్నా ముందున్నారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పట్టణీకరణ, సరైన పోషకపదార్థాలు లేని ఆహారం తీసుకోవడం, వ్యాయామం లోపించడం ఇందుకు కారణాలని అధ్యయనం తేల్చింది.
{loadmodule mod_custom,Side Ad 1}
మొత్తం ప్రపంచ జనాభా దాదాపు 710 కోట్ల మందికాగా, వారిలో 220 మంది, అంటే వారిలో పిల్లలు ఐదుశాతం, పెద్దలు 12 శాతం అధిక బరువుతో బాధ పడుతున్నారు. అమెరికాలో 13 శాతం పిల్లలు, 35 శాతం పెద్ద వాళ్లు అధిక బరువుతో బాధ పడుతున్నారు.
అధిక బరువుతో బాధ పడుతున్న వారిలో 40 శాతం మంది అకాల మత్యువాత పడుతున్నారని వాషింఘ్టన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్రిస్టఫర్ ముర్రే తెలిపారు. స్థూలకాయం కారణంగా వారికి గుండె జబ్బులతోపాటు మధుమేహం, క్యాన్సర్ వస్తున్నాయని ఆయన తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 2}
జనాభా పరంగా చూసినట్లయితే చైనా, ఆ తర్వాత భారత దేశాలు అధిక బరువుతో బాధ పడుతున్నాయి. చైనాలో 1.53 కోట్ల మంది పిల్లలు, భారత్లో 1.44 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో బాధ పడుతున్నారు.
Also read