పంచాయతీ ఎన్నికల వేళ ఘర్షణలు స్రుష్టించి అయినా సరే గెలవాలని ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే తన బాధ్యత మరిచి, ఎలక్షన్లో సత్తా చాటాలని, అందుకోసం అవసరమైతే అల్లర్లు రేపాలని జిల్లా స్థాయి నేతలకు ఫోన్లు చేసి మరీ హుకుం ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన పని బాబు కుట్రలను మరోసారి తేటతెల్లం చేసింది.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో గత కొన్నేళ్లుగా అచ్చెన్న కుటుంబం గుత్తాధిపత్యం కొనసాగుతోంది. కింజారపు ఫ్యామిలీని కాదని వేరే ఎవరైనా నామినేషన్ వేసినా ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది, ఎలాగైన వారి అంతు చూసే దాకా విడిచిపెట్టరని స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటారు. అలాంటిది, ఏకంగా బాబే పగ్గాలు విడిచిపెట్టడంతో, తనకు తిరుగులేదు అన్నట్లు అచ్చెన్న రెచ్చిపోయారు.
అదే ఊపులో… నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కింజరాపు అప్పన్నపై ఇటీవల టీడీపీ నేతలు దాడి చేయడంతో అచ్చెన్న పన్నాగం బయటపడింది. దీంతో ఆయనపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు అందింది. ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీ నేతల బరితెగింపుతో భయాందోళనకు గురవుతున్న అప్పన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నేడు నిమ్మాడ వెళ్లనున్నారు. మరోవైపు.. తన దాడి గురించి వైఎస్సార్సీపీ మద్దతుదారుడు అప్పన్న కోట బొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అచ్చెన్నాయుడిని పోలీసులు నేడు అరెస్టు చేశారు.
గందరగోళం సృష్టించండి. అధికారులను భయపెట్టండి
బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?