ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు ఉన్న దర్శకుల్లో ఎం ఎం కీరవాణి ఒకరు. గతం నుంచి ప్రస్తుతం వరకు కీరవాణి సంగీతానికి, పాటలకు ఎంత క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి-2 సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. నిన్న జరిగిన బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకలో కీరవాణి రాజమౌళి ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఆయన కోసం ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.
‘ఎవ్వడంటా ఎవ్వడంట..? బాహుబలి తీసింది!,
మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది.
ఎవరూ కనందీ..ఎప్పుడూ వినందీ..
శివుని ఆన అయ్యిందమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది.
పెంచింది రాజనందిని.. కొండంత కన్న ప్రేమతో..
ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగు వాడిగా..
చిరాయువై యశస్సుతో ఇలా సాగి పొమ్మని
పెద్దన్న నోటీ దీవెన శివుణ్ని కోరు ప్రార్థన’ అంటూ పాట ముగించాడు.
ఈ పాట విన్నతర్వాత రాజమౌళి కంట్లో నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. బాహుబలి సినిమాలో తనకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకే కృతజ్ఞత తెలుపుతూ కీరవాణి జక్కన్న కోసం ప్రత్యేక గీతాన్ని ఆలపించినట్టు తెలుస్తోంది.
{youtube}P5IdRp-G5QI{/youtube}
Related