- Advertisement -
చైనా యోంగ్ చువాన్ జిల్లాలోని డయాచువాన్ బొగ్గుగనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరినట్లు అధికారులు తెలిపారు. చెత్తను తొలగించే క్రమంలో 24మంది కార్మికులు ప్రమాదవశాత్తు గనిలో చిక్కుకున్నారు. వీరిలో శనివారం 18 మంది మృతించెందారు. ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు.
కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదల అవ్వటం కారణంగా కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.
డియోషుయిడాంగ్ బొగ్గు గనిని 1975లో ప్రారంభించారు. 1998లో దానిని ప్రైవేటుపరం చేశారు. ఇందులో ఏడాదికి 120,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2013, మార్చిలో ఇదే గనిలో హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువుతో ముగ్గురు మరణించినట్లు జిన్హువా తెలిపింది.