భారత్ దక్షిణాఫ్రికా పర్యటనపై ఉఠ్కంఠ కొనసాగుతోంది. సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న సమయంలో భారత జట్టును సౌతాఫ్రికాకు పంపాలా ? వద్దా ? అనే సంగ్దింలో బీసీసీఐ ఉంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురు చూస్తోంది. మరి కేంద్రం అనుమతి ఇస్తుందా ? ఇవ్వదా ? అనేది ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
కరోనా వైరస్ గురించి ఎవ్వరికీ చెప్పనవసరంలేదు. ఎందుకుంటే ఆ వైరస్ వ్యాప్తి చెందని దేశం లేదు. ఈ మహమ్మారి దాదాపు అన్ని దేశాలకు విజృంభించింది. దీని భారిన పడి కోట్లమంది మృతి చెందారు. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చిన ఈ మహమ్మారిని ఆపలేకపోతున్నాయి.
ప్రస్తుతం దక్షిణఫ్రికాను కరోనా కొత్త వేరియంట్ విజృంభన కొనసాగుతోంది. ఈ వేరియంట్తో సౌతాఫ్రికా ప్రభుత్వం దేశంలో ఆంక్షలు విధించింది. ఈ వేరియంట్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సౌతాఫ్రిక-ఇండియా క్రికెట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బీసీసీఐ మాత్రం డైలామాలో పడింది. అన్ని విధాలుగా ఆలోచించిన గంగూలీ బృందం.. కేంద్రంపై భారం వేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం దృష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి.