జియో ఇచ్చిన ఆఫర్ తో దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా యూజర్లు ఈ ఆఫర్ ను వాడుకుంటున్నారు. దేశంలో ఈ జియోని వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇతర్ టెలికం కంపెనీలకు షాక్ ఇచ్చేలా ఈ జియో వెల్కం ఆఫర్ను పొడించారు ముఖేష్ అంబానీ.
ముందుగా డిసెంబర్ 31 వరకు ఇచ్చిన ఈ ఆఫర్ కాలపరిమితిని తర్వాత మార్చి 31 ఆ తర్వాత మే 31 వరకు పొడిగించారు. ఇక యూజర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడంతో జియో ఉచిత ఆఫర్పై పరిమితిని వేధించనుంది. ఈ క్రమంలోనే కొత్త ఏడాది జనవరి నుంచి జియో మరో ఆఫర్ ప్రకటించబోతున్నట్లు లీకులు వదిలింది. ఇకపై జియో వాడే వారు రోజుకి 1జీబీ 4జీ డేటా ఫ్రీగా పొందుతారు. ఆ తర్వాత కూడా డేటా కావలంటే.. 51 రూపాయలతో రీ చార్జ్ చేసుకోవాలి.
1జీబీ 4జీ ఉచిత డేటా తర్వాత 51 రూపాయలు కడితేనే ఆ రోజుకు డేటా అందుబాటులోకి వస్తుంది. ఈ ఆఫర్ కూడా ఓకే అని ప్రస్తుతానికి వినియోగదారులు అనుకున్నా.. నెమ్మది నెమ్మదిగా జియో తన యూజర్లను రీచార్జ్ వైపునకు మళ్లీస్తోన్నట్టు కనిపిస్తోంది. ఒక్కసారి డబ్బులు కట్టడం మొదలు పెడితే.. యూజర్స్ డబ్బు కడుతునే ఉండాలి.
Related