- Advertisement -
కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో చెబుతున్నా ఆ దేశ శాస్త్రవేత్తలు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. కరోనా కేసులను మొదటగా వుహాన్లో గుర్తించినంత మాత్రాన.. వైరస్ చైనాలో ఉద్భవించినట్లు కాదని పేర్కొన్నారు. కరోనా జన్యు పరివర్తనంలో అతి తక్కవ మార్పులు కన్పిస్తున్న ఆసియా దేశాలు భారత్ లేదా బంగ్లాదేశ్లోనే కరోనా మూలాలు ఉండొచ్చని చెబుతున్నారు.1
ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ‘ద అర్లీ క్రిప్టిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సార్స్ కోవ్-2 ఇన్ హ్యూమన్ హోస్ట్స్’ పేరుతో విడుదల చేశారు చైనా శాస్త్రవేత్తలు. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్కు చెందిన ప్లాట్ఫాం ‘SSRN.Com’ వెబ్సైట్ దీన్ని ప్రచురించింది.
ఢిల్లీలో వాక్సిన్ పంపిణీ.. ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన..!
శబరిమలలో కరోనా.. అందరూ హడల్..?